హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): కరోనా బాధితులకు, వారి కుటుంబసభ్యులకు కేసీఆర్ సేవాసమితి, గ్రీన్ ఇండియా చాలెంజ్, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆదివారం కోఠి ప్రసూతి దవాఖానలో అన్నదానం చేశారు. లాక్డౌన్ ఉన్నన్ని రోజులు తాము రోజుకు 1,500 మందికి అన్నదానం చేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. 13 రోజులుగా పండ్లు, కోడిగుడ్డు, మినరల్వాటర్తో పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజీవ్సాగర్, టీఎన్జీవో సెంట్రల్ కమిటీ సీనియర్ కార్యదర్శి గరిగబోయిన చంద్రశేఖర్, టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి గదరాజు చందు, వొడపల్లి మాధవ్, ఓయూ నాయకులు కనుకుంట్ల హరీశ్, వాసుదేవ్, రాజుయాదవ్, కరాటే మాస్టర్లు రవి, విజయ్, నారాయణ, విక్కీ, బాబురాజ్, బసవరాజు, హబీబ్, నోముల శ్రీకర్, మోహన్గాంధీ, బోనాల సంతోష్, మెట్టు శివ పైల్వాన్, కోఠి మెటర్నిటీ హాస్టల్ సూపరింటెండెంట్ డాక్టర్ కే రాజ్యలక్ష్మి, టీఎన్జీవో ప్రెసిడెంట్ బీ లక్ష్మణ్, కార్యదర్శి ఏ వెంకట్రాజు, పీ సూర్యప్రకాశ్, బీ వేణుగోపాల్రెడ్డి, ఆర్ రఘు, ఏ బాలరాజు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.