న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జికి, జాతీయస్థాయి బీజేపీ నేతలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. బెంగాల్లో బీజేపీ కార్యకర్తకు, టీఎంసీ కార్యకర్తలకు మధ్య గత నెల జరిగిన గొడవలో బీజేపీ కార్యకర్త గోపాల్ మజుందార్ తల్లి శోభ మజుందార్ తీవ్రంగా గాయపడ్డారు. దాంతో అప్పట్లో బీజేపీ, టీఎంసీ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. సోమవారం ఉయదం శోభ మజుందార్ మృతిచెందడంతో రెండు పార్టీల నేతలు మరోసారి పరస్పర విమర్శలకు తెరతీశారు.
పశ్చిమబెంగాల్లో గూండా రాజ్యం కొనసాగుతున్నదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించగా, బెంగాల్ గురించి మాట్లాడే ముందు బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో పరిస్థితులను గుర్తుచేసుకోవాలని మమతాబెనర్జి కౌంటర్ ఇచ్చారు. హత్రాస్ పరిస్థితి ఏంది..? ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతున్నది..? అని ప్రశ్నాస్త్రాలు సంధించారు. మమత వ్యాఖ్యలపై తాజాగా మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విమర్శలు గుప్పించారు.
మమతా బెనర్జి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ధర్మేంద్ర ప్రధాన్ విమర్శించారు. నందిగ్రామ్లో ప్రజల నుంచి తృణమూల్ వ్యతిరేక స్పందన వస్తుండటాన్ని ఆమె తట్టుకోలేక పోతున్నారన్నారు. బెంగాల్లో టీఎంసీ దాడిలో మరణించిన బీజేపీ కార్యకర్త తల్లి శోభ మజుందార్ మృతికి సంతాపం తెలుపాల్సింది పోయి మమత ఉత్తరప్రదేశ్ గురించి ప్రశ్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇది ఆమె తన బాధ్యతల నుంచి తప్పుకోవడం తప్ప మరొకటి కాదని, ఆమెకు ఓటమి భయం పట్టుకున్నదని ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఆక్సిజన్ పైప్తో ఉరేసుకుని కొవిడ్ బాధితుడి ఆత్మహత్య
ఉగ్రవాదుల దాడిలో గాయపడ్డ కౌన్సిలర్ మృతి
పున్నమి చంద్రుడే ఆ నౌకను కదిలించాడు.. !
ఫరూక్ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్
భారత మహిళా క్రికెటర్ హర్మన్ప్రీత్ కౌర్కు కరోనా పాజిటివ్