వాషింగ్టన్, సెప్టెంబర్ 22: కరోనా వైరస్తో కొందరిలో తీవ్ర మానసిక సమస్యలు తలెత్తుతున్నట్టు అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. వైరస్ సోకిన కొంత మంది పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తించడాన్ని గుర్తించినట్టు మిషిగన్ వర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. గతేడాది మార్చిలో అమెరికాలో కరోనా వైరస్ వెలుగుచూసిన తొలినాళ్లలో దవాఖానల్లో చేరిన 150 మందిపై వారు అధ్యయనం నిర్వహించారు. అందులో 73 మందిలో తీవ్ర మానసిక సమస్యలు కనిపించాయి. కరోనా వల్ల మెదడుకు ఆక్సిజన్ సరఫరా కాకపోవడం, రక్తం గడ్డకట్టడం లాంటి వాటివల్ల ఇలా జరుగుతుందని చెప్పారు.