బ్రెజిల్ దేశాధ్యక్షుడికి వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న నిరసనలు
5 లక్షలకు చేరిన కరోనా మృతుల సంఖ్య
రియో డి జెనిరో, జూన్ 20: బ్రెజిల్ దేశాధ్యక్షుడు జైర్ బోల్సొనారోపై వ్యతిరేకత పెరుగుతున్నది. కరోనా కట్టడిలో ఆయన దారుణంగా విఫలమయ్యారని ఆరోపిస్తూ నిరసనకారులు దేశవ్యాప్తంగా ఆందోళనల బాట పట్టారు. ‘గెట్ అవుట్ బోల్సొనారో..’ నినాదాలతో వీధుల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దేశంలో కరోనా మరణాలు 5 లక్షలకు చేరిన నేపథ్యంలో వేలాది మంది నిరసనకారులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.