అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఏర్నేని, రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన షూటింగ్ను ఈ మంగళవారం హైదరాబాద్లో పునఃప్రారంభించారు. నిర్విరామంగా 45రోజుల పాటు జరిగే తాజా షెడ్యూల్తో తొలిభాగం చిత్రీకరణ పూర్తిచేయబోతున్నారని సమాచారం.
ఎర్రచందనం స్మగ్లింగ్ ఇతివృత్తంతో చిత్తూరు నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్గా శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్రను పరిచయం చేస్తూ కొద్ది నెలల క్రితం విడుదల చేసిన వీడియో అత్యధిక యూట్యూబ్ వీక్షణలతో తెలుగు చిత్రసీమలో సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో రష్మక మందన్నా హీరోయిన్ కాగా.. విలన్గా మలయాళ నటుడు ఫహద ఫాసిల్ నటిస్తున్నాడు. అనసూయ భరద్వాజ్ కీలక పాత్ర పోషిస్తుంది. తాజాగా ఈ అమ్మడు టీంతో జాయిన్ అయింది. ఈ విషయాన్ని తన ఇన్స్టాలో ‘పుష్ప’ షూటింగ్ లోకేషన్ షేర్ చేస్తూ పేర్కొంది. రెండు భాగాలుగా విడుదల కానున్న ‘పుష్ప’ సినిమా తొలి పార్ట్ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.