టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుల ఉమ
సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత
కథలాపూర్, మార్చి 29: టీఆర్ఎస్ ప్రభు త్వం పేదలకు అండగా ఉంటున్నదని ఉమ్మడి కరీంనగర్ జడ్పీ మాజీ అధ్యక్షురా లు, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుల ఉమ పేర్కొన్నారు. సోమవారం పెగ్గెర్లలో మ్యాకల శోభన్కు మంజూరైన రూ. 29 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అతడి కుటుంబసభ్యులకు అందించారు. అనంతరం భూషణరావుపేటలో టీఆర్ఎస్ సీనియర్ నేత పుర్కుటపు గంగారెడ్డి తల్లి లింగవ్వ ఇటీవల మృతిచెందింది. వారి కుటుంబీకులను పరామర్శించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు జవిడి ప్రతాప్రెడ్డి, కూన శ్రీనివాస్, వాకిటి రాజారెడ్డి, పూండ్ర ప్రతాప్రెడ్డి, గడ్డం దేవారెడ్డి, పుల్ల జగన్, బోడ మాధవరెడ్డి, శంకర్, దశరథం, రవినాయక్, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మేడిపల్లి, మార్చి 29 : మండల కేంద్రాని కి చెందిన ఎం రాజుకు మంజూరైన రూ. 24వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును తుల ఉమ సోమవారం అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరుకు కృషి చేసిన తుల ఉమకు బాధిత కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక్కడ పలువురు నాయకులున్నారు.