వేసవిలో సాగుభూములను ఖాళీగా వదిలేయకుండా, రైతులు నువ్వులను సాగు చేస్తుంటారు. అయితే, విత్తనాలు మొలకెత్తే సమయంలోనూ, పూతదశలోనూ నువ్వుల పంటకు కొన్ని రకాల తెగుళ్లు సోకే ప్రమాదం ఉన్నదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాటిని అరికట్టేందుకు సస్యరక్షణ చర్యలను సూచిస్తున్నారు.