క్యాబినెట్ మంత్రుల నియామకాన్ని రద్దు చేసిన సుప్రీంకోర్టు
కాఠ్మండు, జూన్ 22: నేపాల్లో రాజకీయ సంక్షోభం ముదురుతున్నది. ఇప్పటికే నేపాల్ పార్లమెంట్లో విశ్వాసం కోల్పోయి మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలో నియమితమైన క్యాబినెట్ చెల్లదని ఆ దేశ సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు ఓలీ నియమించిన 20 మంది క్యాబినెట్ మంత్రుల నియామకాన్ని మంగళవారం రద్దు చేసింది. సభ రైద్దెన తర్వాత క్యాబినెట్ విస్తరణ రాజ్యాంగ విరుద్ధమని స్పష్టంచేసింది. గతనెలలో జరిగిన విశ్వాసపరీక్షలో ఓడిపోయిన ఓలీ.. ఈనెల 10న 17 మంది మంత్రులను నియమించారు. కోర్టు తీర్పుతో ఓలి క్యాబినెట్లో ఆయనతో పాటు మరో ఐదుగురు మంత్రులు మాత్రమే మిగిలారు.