వరంగల్ అర్బన్ : పేకాట ఆడుతున్న ఎనిమిది మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగసాయిపేటలో గల రాజ రాజేశ్వరా హోటల్లో ఆదివారం చోటుచేసుకుంది. సంఘటనా స్థలం నుంచి పోలీసులు రూ.74,190 నగదు, మూడు బైక్లు, ఏడు సెల్ఫోన్లు, ప్లేయింగ్ కార్డ్స్ను స్వాధీనం చేసుకున్నారు. రాజ రాజేశ్వరా హోటల్ యజమాని షెర్ల అనీల్ వారాంతాల్లో గ్యాంబ్లింగ్ను నిర్వహిస్తున్నాడు. టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ బి. నందిరామ్ నాయక్, జి.మధు నాయకత్వంలో ఈ రైడ్ జరిగింది.