ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నివాళులర్పించిన ప్రముఖులు
సేవలను కొనియాడిన నాయకులు, అధికారులు
ఎదులాపురం, ఏప్రిల్ 5 : బాబూ జగ్జీవన్ రామ్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలో బాబూ జగ్జీవన్రామ్ 114వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే, కలెక్టర్ హాజరై, చౌరస్తాలోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మా ట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్రామ్ అని కొనియాడారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత పదవులు చేపట్ట్టి ప్రజలకు సేవలందించారని తెలిపారు. ఆధ్యాత్మిక భావన, సమాజసేవకోసం పాటు పడిన వ్యక్తి అని పేర్కొన్నారు. 1946 నాటి నెహ్రూ మంత్రి వర్గంలో పనిచేశారన్నారు. అనంతరం కలెక్టర్ సిక్తాపట్నాయక్ మాట్లాడుతూ, బాబూ జగ్జీవన్ రాం కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో మంత్రిగా, ఉప ప్రధానిగా పనిచేశారని పేర్కొన్నారు. ఇండియా, పాకిస్తాన్ పోరాటంలో పాల్గొన్నారని గుర్తుచేశారు. అనంతరం ఎస్సీ సంక్షే మ కార్యాలయంలో బాబూ జగ్జీవన్రామ్, అంబేద్కర్, జ్యోతి బా ఫూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీనివాస్రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం డేవిడ్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, జడ్పీ సీఈవో కిషన్, జిల్లా సంక్షేమాధికారి బాగత్ సునీత, జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి రాజలింగు, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎస్ భీంకుమార్, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, బీసీ స్డడీసర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
జగ్జీవన్రామ్ ఆశయాలను సాధిద్దాం
బాబూ జగ్జీవన్రాం ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పేర్కొన్నా రు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాబూ జగ్జీవన్రామ్ జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమానత్వ స్వాతంత్య్రం కోసం ఆయన చేసిన పోరాటం ఎంతో గొప్పదని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, రెవెన్యూ అదనపు కలెక్టర్ రాంబాబు, కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులు కరీం, హేమబిందు, నారాయణ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
జవాన్ల కుటుంబాలకు 30 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన ఏపీ సీఎం
హోమ్లోన్పై వడ్డీ రేటు పెంచిన ఎస్బీఐ
‘జాతి రత్నాలు’ 25 డేస్ కలెక్షన్స్.. బ్లాక్బస్టర్ కా బాప్..
రష్మికకు మాజీ బాయ్ఫ్రెండ్ విషెస్..వీడియో