న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ( PM Modi ) ఈ నెల 24న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఇరుదేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలపై వారు చర్చించనున్నారు. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం అమెరికా అధ్యక్షభవనం వైట్ హౌస్ అధికారులు ప్రకటించారు. కాగా, జో బైడెన్తో భేటీకి ముందు వైట్హౌస్లోనే క్వాడ్ నేతలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. ఆఫ్ఘనిస్థాన్లో పరిణామాలు, ఇండో పసిఫిక్ సంబంధాలు, కరోనా మహమ్మారి, పర్యావరణ మార్పులు తదితర అంశాలపై వారితో చర్చించనున్నారు. ఈ సమావేశానికి ముందు ఈ నెల 23న జపాన్, ఆస్ట్రేలియా ప్రధానులతో విడివిడిగా ప్రధాని మోదీ భేటీ కానున్నారు.