న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.439 పెరిగి రూ.46,680కి చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,241 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో విలువైన లోహాల ధర పెరుగడమే దేశీయ మార్కెట్లలో బంగారం, వెండి ధర స్వల్పంగా పెరుగడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
అదేవిధంగా వెండి ధర కూడా పెరిగింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,302 పెరిగి రూ.69,511కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.68,209 వద్ద ముగిసింది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,792 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 26.72 అమెరికన్ డాలర్లు పలికింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
వర్షాలు కురువాలని కప్పలకు పెండ్లి..వీడియో
ఆర్ఎల్డీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ కరోనాతో కన్నుమూత
దర్శకుడికి కరోనా.. చికిత్సకు సాయం చేసిన కమెడీయన్
ఇంటినుంచే ఇంజినీరింగ్ పరీక్షలు
తెలంగాణలో కొత్తగా 6,026 కరోనా కేసులు