ప్రజా జీవితంలో నిత్యం బిజీగా ఉండే జర్మనీ చాన్స్లర్ ఏంజెలా మెర్కల్ గురువారం కాస్త సేదతీరారు. మార్లోలోని పక్షుల పార్కును సందర్శించిన ఆమె చిలుకలతో సరదాగా గడిపారు. వాటికి ఆహారం పెట్టి ఆనందంతో మురిసిపోయారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పక్షుల పరిరక్షణకు అధికారులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారని తెలిపారు.