న్యూయార్క్: కరోనా వేళ కూడా పికాసో గీసిన చిత్రాలకు డిమాండ్ తగ్గలేదు. ప్రఖ్యాత చిత్రకారుడు పాబ్లో పికాసో గీసిన ఓ బొమ్మ.. వేలం పాటలో 10 కోట్ల డాలర్లకు అమ్ముడుపోయింది. న్యూయార్క్లోని క్రిస్టీ సంస్థ దీన్ని వేలం వేసింది. ఓ కిటికీ వద్ద ఓ మహిళ కూర్చున్న థీమ్తో ఉన్న పేయింట్ను ఆ సంస్థ ఆన్లైన్లో వేలం వేసింది. 1932లో పికాసో ఆ చిత్రాన్ని గీశారు. కేవలం 19 నిమిషాల్లోనే ఆ పెయింటింగ్ అమ్ముడుపోయింది. కరోనా వేళ నిజానికి చాలా తక్కువ ధరకు ఆ చిత్రం అమ్ముడుపోతుందని భావించారు. కానీ పికాసో ఆర్ట్కు ఉన్న క్రేజీయే వేరు. చిత్రకారుడు పికాసో 1881లో జన్మించారు. 1973లో మరణించారు.