జోగులాంబ గద్వాల : పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని సీఎంవో ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని ఇటిక్యాల మండలం కోదండాపురం గ్రామాన్ని సందర్శించారు. గ్రామాన్ని అన్నివిధాల అభివృద్ధి చేశారని, ముఖ్యంగా పల్లె ప్రకృతి వనం రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారని స్మితా సబర్వాల్ గ్రామ సర్పంచ్ సుంకన్ను అభినందించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడారు. అంతకుముందు ప్రకృతి వనం, వైకుంఠధామం, నర్సరీ, సెగ్రిగేషన్ షెడ్ పరిశీలించారు. అనంతరం గ్రామ సభలో పాల్గొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమాలపై ఏమైనా సందేహాలు, సమస్యలు ఉన్నా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు రావాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ శృతి ఓజా జెడ్పీ చైర్ పర్సన్ సరిత, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
వరంగల్లో ముగ్గురు గంజాయి స్మగ్లర్ల అరెస్టు
చెరువులో పడి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
సమస్త జీవకోటికి మొక్కలే ప్రాణాధారం
పల్లె ప్రగతికి సహకరిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం
న్యూజిలాండ్ సెలబ్రేషన్స్ చూసి తట్టుకోలేకపోయాం: అశ్విన్