పారిస్: పెగాసస్ స్పైవేర్తో జర్నలిస్టులను హ్యాక్ చేసిన ఘటనపై ఇవాళ ఫ్రాన్స్ విచారణ ప్రారంభించింది. ఫ్రాన్స్కు చెందిన జర్నలిస్టులపై మొరాకో ఇంటెలిజెన్స్ సర్వీసెస్ మాల్వేర్తో హ్యాక్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 10 అంశాలపై విచారణ చేపట్టనున్నట్లు పారిస్ ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఇన్వెస్టిగేటివ్ వెబ్సైట్ మీడియాపార్ట్.. హ్యాకింగ్ అంశంలో ఫిర్యాదు చేసింది. మరో పత్రిక లీ కనార్డ్ ఎంచైనా కూడా కోర్టులో కేసు దాఖలు చేసింది. కానీ మొరాక్కో మాత్రం నిఘా ఆరోపణలను కొట్టిపారేసింది. మీడియాపార్ట్ వ్యవస్థాపకుడు ఎడ్వీ ప్లీనెల్ ఫోన్ను మొరాకో ఇంటెలిజెన్స్ హ్యాక్ చేసినట్లు ఆ సంస్థ చెప్పింది. తమ జర్నలిస్టుల ఫోన్లను హ్యాక్ చేసినట్లు ఫ్రాన్స్ పత్రికలు ఆరోపించాయి. కానీ మొరాకో మాత్రం వాటిని తిరస్కరించింది.