పట్నా: బీహార్లో మరో 10 రోజులు లాక్డౌన్ను పొడిగించారు. ఇప్పటికే మే 15 వరకు లాక్డౌన్ అమల్లో ఉంది. ఇప్పుడు ఆ లాక్డౌన్ను మరింత పొడిగించాలని బీహార్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు మే 16 నుంచి 25వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని బీహార్ ముఖ్యమంత్రి నితీశకుమార్ కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
రాష్ట్రంలో కరోనా మహమ్మారి పరిస్థితిపై క్యాబినెట్లో సమీక్ష నిర్వహించామని, లాక్డౌన్ సత్ఫలితాలు ఇచ్చిందని ఈ సమావేశంలో తీర్మానించామని, అందుకే లాక్డౌన్ను మరో 10 రోజులు పొడిగించాలని నిర్ణయించామని నితీశ్ కుమార్ ట్విట్టర్లో పేర్కొన్నారు.