లక్షణాలు లేకుంటే అదే మేలు
చాలామందిలో భయంతోనే పడిపోతున్న ఆక్సిజన్ స్థాయి
నేచర్ క్యూర్ దవాఖాన సూపరింటెండెంట్ భవానీ
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): కరోనా కంటే.. ఆ పేరు వింటే కలిగే భయంతోనే చాలామందిలో ఆక్సిజన్ స్థాయి (లెవల్స్) పడిపోతున్నదని నేచర్ క్యూర్ దవాఖాన సూపరింటెండెంట్ ఎస్ భవాని తెలిపారు. పాజిటివ్ అని తేలగానే చాలామంది అనవసరంగా గాభరా పడుతున్నారని చెప్పారు. దీంతో ఎక్కువమందిలో రెండ్రోజులపాటు మల విసర్జన జరగక ఆక్సిజన్స్థాయి గణనీయం గా పడిపోతున్నదన్నారు. పాజిటివ్ రాగానే లక్షణాలు లేకున్నా దవాఖానలో చేరాలని ఆరాటపడుతున్నారని చెప్పారు. లక్షణాలు లేనివారు, స్వల్ప లక్షణాలున్నవారు ఇంట్లో ఐసొలేషన్లో ఉండి జాగ్రత్తలు పాటిస్తే నయమవుతుందని పేర్కొన్నారు. ఈ అవగాహన లేక దవాఖానల్లో రద్దీ పెరుగుతున్నదని చెప్పారు. కొంతమంది అవసరం లేకున్నా ఒత్తిడి తెచ్చి ఇన్పేషెంట్లుగా చేరుతున్నారని, ఫలితంగా తీవ్రత ఉండి ఇన్పేషెంట్లుగా చేరాల్సినవారికి బెడ్లు దొరకడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. వివిధ అనారోగ్య సమ స్యలతో చాలామంది దవాఖానలకు వస్తుంటారని, అవసరం లేనివారు హాస్పిటల్లో చేరితే ముప్పు కొనితెచ్చుకున్నట్టేనన్నారు.