ముంబై: దేశంలో కరోనా రోగుల సంఖ్య పెరిగిపోవడంతో వివిధ ఆస్పత్రుల్లో ఆక్సిజన్కు ఫుల్గా డిమాండ్ పెరిగింది. కరోనా వైరస్ శ్వాసవ్యవస్థ మీద ప్రధానంగా ప్రభావం చూపుతుండటంతో ఆ వైరస్ బారినపడిన వారికి శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే వారికి కృత్రిమ శ్వాస అందిస్తుంటారు. అందుకు ఆక్సిజన అందుబాటులో ఉన్న బెడ్లు అవసరమవుతాయి.
అయితే, కరోనా కారణంగా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిలువలు నిండుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇవాళ మహారాష్ట్రలోని నాసిక్ పట్టణంలోగల జకీర్ హుస్సేన్ ఆస్పత్రిలోని ఫిల్లింగ్ స్టేషన్ నుంచి ట్యాంకర్లలోకి ఆక్సిజన్ను నింపుతుండగా, ఒక ట్యాంకర్ లీకైంది. దాని నుంచి భారీగా తెల్లటి పొగ రూపంలో ఆక్సిజన్ బయటకి వస్తున్నది. దాంతో అప్రమత్తమైన అధికారులు లీకేజీని మూసేవేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇవికూడా చదవండి
మామిడి పండ్లు తింటే ఇన్ని లాభాలా..!
38 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్.. ఏ జైల్లోనో తెలుసా..?
సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని మంత్రి సత్యవతి పూజలు
ఈ నెల 30 వరకు బ్రిటన్కు విమాన సర్వీసులు బంద్ : ఎయిర్ ఇండియా
కరోనాతో హాస్పిటల్లో చేరిన ధోనీ తల్లిదండ్రులు
బెంగాల్లో B.1.618 వేరియంట్ దడ..