బండ్లగూడ, ఏప్రిల్ 2 : రోడ్డు పక్కన ఉంచిన కారులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రాజేంద్రనగర్ ఎస్ఐ సమరంరెడ్డి కథనం ప్రకారం.. బహదూర్పురా రమ్నాజ్పురా ప్రాంతానికి చెందిన మహ్మద్ రియాజ్ గత నెల 30న కారు (ఏపీ 11 ఏజీ 2709)లో పిల్లర్ నంబర్ 304 మీదుగా వెళ్తుండగా కారు బ్రేక్డౌన్ అయింది. దీంతో కారును అక్కడే నిలిపి.. ఇంటికి వెళ్లిపోయాడు. మ రుసటి రోజు ఉదయం కారు మరమ్మతు చేయించుకునేందుకు రాగా కారులో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నట్లు గమనించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కారు డోర్కు లాక్ లేకపోవడం వల్ల అతను కారులో పడుకునేందుకు వెళ్లి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.