ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించే స్థాయి, అర్హత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి లేదు. విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చకుండా బీజేపీ తెలంగాణకు ద్రోహం చేస్తున్నది. ములుగులో గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫాక్టరీ ఏర్పాటుపై నిర్లక్ష్యం ఇందుకు నిదర్శనం. బండికి చేతనైతే ములుగులో గిరిజన వర్సిటీ ప్రారంభించి, మేడారం జాతరకు జాతీయ పండుగగా గుర్తింపు తెచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. నాడు స్వరాష్ట్రం కోసం లేసిన మానుకోట రాళ్లు.. నేడు తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్న బీజేపీని సమాధి చేస్తాయి. ములుగు జిల్లాలో ఉన్న 10 వేల మందికిపైగా పట్టభద్రులు టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డికి మొదటి ప్రాధాన్య ఓటు వేయాలి – మంత్రి సత్యవతి రాథోడ్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి మొదటి ప్రాధాన్య ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి. ఆరేండ్లలో టీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అందరికీ తెలిసినవే. సీఎం కేసీఆర్ హయాంలో భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతాం. ప్రైవేట్ విద్యాసంస్థల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం.
– ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్
అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్ఎస్కు శ్రీరామరక్ష. పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులకు సంక్షేమ ఫలాలు అందిస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు, పుష్కలంగా సాగు నీరిస్తున్నామని పార్లమెంట్లో చెప్తుంటే ఇతర రాష్ర్టాల ఎంపీలు ఆశ్చర్యపోతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. -ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్రావు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకే మొదటి ప్రాధాన్య ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి. తెలంగాణ ఠీవి పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవిని, తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న పల్లా రాజేశ్వర్రెడ్డికి సంపూర్ణ సహకారం అందించి గెలిపించుకోవాల్సి బాధ్యత తెలంగాణ బిడ్డలందరిపైనా ఉన్నది. 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటంతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, ఆరేండ్లుగా రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలపర్చేలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు తమ ఓటును టీఆర్ఎస్ అభ్యర్థులకే వేయాలి.
– కోలేటి దామోదర్గుప్తా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్