రవాణా సేవల్లో కొత్త ఉత్సాహం
తక్కువ చార్జీలకే ఆర్టీసీ పార్సిల్ సేవలు
మెదక్ రీజియన్లో 8 ప్రత్యేక బస్సులు
9 నెలల్లో రూ.1.13 కోట్ల ఆదాయం
1.49 లక్షల పార్సిళ్ల చేరవేత
18 పాయింట్లతో రవాణా సంస్థ సేవలు
సంగారెడ్డి, మార్చి 31 : తెలంగాణ ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థను పటిష్టం చేస్తూ ఎన్నో మార్పులు తీసుకువస్తున్నది. ఆర్టీసీ సేవలను మరింతగా విస్తృతం చేస్తున్నది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సులు వెళ్తూ రవాణా సౌకర్యాన్ని ప్రజలకు చేరువ చేసింది. కరోనా కాలంలో కొంతమేర ఇబ్బంది పడ్డ ఆర్టీసీ సంస్థ, ఇదే సమయంలో కార్గో సేవలను ప్రారంభించి మళ్లీ పుంజుకుంటున్నది. ప్రస్తుతం ఆదాయం పుష్కలం కావడంతో కార్మికులు రెట్టింపు ఉత్సాహంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలను అందిస్తున్నారు. నిరాటకంగా కొనసాగిస్తూ పార్సిల్ సేవల్లో ఆర్టీసీ తనదైన ముద్ర వేసుకుంటున్నదని చెప్పవచ్చు. మెదక్ రీజియన్ పరిధిలో 18 పాయింట్లను ఏర్పాటు చేసి 8 ప్రత్యేక బస్సులతో కార్గో సేవలు కొనసాగిస్తున్నారు. గడిచిన 9 నెలల్లోనే 1,49,078 పార్సిళ్లను చేరవేసి, రూ.1,13,45,717 కోట్ల ఆదాయాన్ని అర్జించిందని అధికారులు తెలిపారు. ఆర్టీసీకి కాసుల వర్షం కురిపిస్తున్న కార్గో సేవలను మరింత విస్తృతం చేస్తూ తక్కువ చార్జీలకే ప్రజల చెంతకు చేరవేస్తున్నారు.
దశాబ్దాల పాటు రోడ్లున్న ప్రతి గ్రామానికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు తిప్పినా ఆదాయం రాక నష్టాల ఊబీలో ఆర్టీసీ చిక్కుకున్నది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తొలి రోజుల్లో చర్యలు చేపట్టి నిధులు విడుదల చేసినా ఆర్టీసీకి నష్టాలు తగ్గలేదు. కార్గో సేవలు చేస్తే దండిగా ఆదాయం వస్తుందని చేసిన ప్రయత్నం చాలా గొప్పది. రోడ్డు మార్గం ఉన్నా ప్రతి గ్రామానికి బస్సులు నడిపి నష్ట పోయిన ఆర్టీసీ ఇప్పుడు కార్గో సేవలతో దండిగా ఆదాయం వస్తుందని, కార్మికుల జీతాలకు ఢోకాలేదని కార్మికులు దీమాలో ఉన్నా రు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రెట్టింపు ఉత్సాహంతో కార్మికులు తమ విధులను పై అధికారుల ఆదేశాల మేరకు చేస్తున్నారు. ఆర్టీసీలో నూతనంగా కార్గో సేవలను కరోనా కష్ట కాలంలో జూన్ 19, 2020లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. అప్పటి నుంచి రవాణా సేవలు నిరాటకంగా కొనసాగిస్తూ పార్సిళ్ల సేవల్లో ఆర్టీసీ తనదైన ముద్ర వేసుకున్నది. ప్రైవేట్ పార్సిల్ సర్వీసులకు దీటుగా ఆర్టీసీ సేవలు విస్తృతం చేసి సరుకుల రవాణాలో తాము ముందున్నామని చాలెంజ్ చేసే స్థాయికి ఎదిగింది. ఇందుకోసం ఆర్టీసీ యా జమాన్యం, అధికారులు, కార్మికులు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ ఆదాయం పెంచడానికి చర్యలు చేపట్టారు. 9 నెల ల్లో మెదక్ రీజియన్ పరిధిలో 18 పాయింట్లను ఏర్పాటు చేసి 1,49,078 పార్సిళ్లను ఇంటింటికీ సరఫరా చేయడంతో రూ.1, 13,45,717 కోట్ల ఆదాయం సమకూర్చుకుంది. గతంలో బస్సు చక్రాలు రోడ్డుపై తిరిగితేనే కార్మికుల జీతాలు వచ్చేవని, ప్రస్తుతం అలా కాకుండా కేవలం పార్సిళ్లను వినియోగదారులు ఇచ్చిన అడ్రస్లకు చేరవేస్తే వచ్చే ఆదాయంతో వేతనాల చింతలేదనే దీమాలో కార్మికులు ఉండటం హర్షణీయం.
18 పాయింట్లు.. 8 బస్సులు
మెదక్ రీజియన్ పరిధిలోని 8 డిపోల్లో 8 ప్రత్యేక కార్గో బస్సులతో 18 పాయింట్లను ఏర్పాటు చేసి పార్సిల్ సేవలను ఆర్టీసీ అందజేస్తున్నది. కార్గో రవాణాకు ఏర్పాటు చేసిన బస్సులతో పాటు ఆయా రూట్లలో నడుస్తున్న బస్సుల్లో వినియోగదారులు ఇచ్చిన చిరునామాకు పార్సిళ్లను అధికారులు చేరవేస్తున్నారు. సంగారెడ్డి డిపో పరిధిలో ఒకటి, సదాశివపేట, జోగిపేట బస్టాండ్లలో పాయింట్లు ఏర్పాటు చేసి వినియోగదారులకు సేవలు అందిస్తున్నారు. అలాగే జహీరాబాద్లో ఒకటి, నారాయణఖేడ్, పెద్ద శంకరంపేట, మెదక్ డిపోలతో పాటు నిజాంపేట్, నర్సాపూర్, రామాయంపేట్, చేగుంటలో ఏర్పాటు చేశారు. సిద్దిపేట డిపో పరిధిలోని పాత, కొత్త బస్టాండ్లు, చెర్యాల్లో, దుబ్బాక డిపోలో, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, తూప్రాన్, హుస్నాబాద్ డిపోల పరిధిలో పాయింట్లను ఏర్పాటు చేసి పార్సిళ్లను సకాలంలో అందిజేస్తున్నారు. కరోనా లాంటి విపత్కర కాలంలో ప్రారంభించి తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయంపై దృష్టి పెట్టి ఆర్టీసీ రాబడికి దారులు వేయడంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇంటింటికీ కార్గో సేవలు
సమాజంలో పుట్టిన ప్రతి వ్యక్తికి ఏదో విధంగా ఒకరి సేవలు ఉపయోగపడటం తప్పనిసరి. కుటుంబానికి అవసరమైన వస్తువులతో పాటు దూర ప్రాంతాలకు చేరవేసే సరుకులను పార్సిళ్లను ఆర్టీసీ చేరవేస్తున్నది. చిన్న గుండు సూది నుంచి బస్సుల్లో రవాణా చేసే వస్తువులన్నింటినీ విని యోగదారుల చిరునామాలకు చేరవేయడం గొప్పవిషయం.
ఇవి కూడ చుడండి
ఇన్స్టాగ్రామ్ పరిచయం ప్రాణం తీసింది
పెండ్లి అయిన 20 రోజులకే అదనపు కట్నం వేధింపులు