ఇస్లామాబాద్: ఆఫ్ఘనిస్థాన్కు తాత్కాలికంగా విమాన రాకపోకలను నిలిపేసింది పాకిస్థాన్. ప్రస్తుతానికి అక్కడి వాళ్లను తరలించే ప్రక్రియను ఆపేసినట్లు పీటీఐ వెల్లడించింది. పాకిస్థాన్ ఇంటర్నేషన్ ఎయిర్లైన్స్ గత కొన్ని రోజులుగా కాబూల్లో చిక్కుకుపోయిన దౌత్యవేత్తలు, విదేశీయులను అక్కడి నుంచి తరలిస్తూ వస్తోంది. అయితే కాబూల్ ఎయిర్పోర్ట్లో సరైన వసతులు లేకపోవడం, రన్వేపై భారీ ఎత్తున చెత్త పేరుకుపోవడం వల్ల తాత్కాలికంగా తమ విమానాలను నిలిపేస్తున్నట్లు పీఐఏ తెలిపింది. కాబూల్ ఎయిర్పోర్ట్లో అసలు భద్రతా సిబ్బంది, ఇమ్మిగ్రేషన్ సిబ్బంది కూడా లేరని ఆ ఎయిర్లైన్స్ వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకూ ఐదు విమానాల్లో మొత్తం 1500 మంది జర్నలిస్టులు, యూఎన్ అధికారులు, పాకిస్థాన్ జాతీయులను తరలించినట్లు పీఐఏ తెలిపింది.