ఆండ్రాయిడ్ యూజర్లు సిస్టమ్ అప్డేట్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలని మొబైల్ సెక్యూరిటీ సంస్థ జింపెరియమ్ జెడ్ల్యాబ్స్ సూచిస్తోంది. కొత్తగా వచ్చిన మాల్వేర్ కారణంగా ఆండ్రాయిడ్ ఫోన్లకు ముప్పు పొంచి ఉన్నట్లు ఆ సంస్థ చెబుతోంది. ఈ అత్యాధునిక మాల్వేర్ మీ వ్యక్తిగత డేటా అయిన టెక్ట్స్ మెసేజ్లు, ఫొటోలు, కాంటాక్ట్లను దొంగిలించగలదని హెచ్చరిస్తోంది. అంతేకాదు మీ స్మార్ట్ఫోన్ను ఈ మాల్వేర్ పూర్తిగా నియంత్రించగలదనీ చెప్పింది. ఈ బగ్ ఒకసారి మీ స్మార్ట్ఫోన్లోకి చొరబడిన తర్వాత.. హ్యాకర్లు ఎక్కడి నుంచైనా మీ ఫోన్కు హాని కలిగించే చర్యలను చేపట్టగలరని జింపెరియమ్ ఓ బ్లాగ్ పోస్ట్లో తెలిపింది.
ఆండ్రాయిడ్ యూజర్లకు సిస్టమ్ అప్డేట్ అనే యాప్ ద్వారా ఈ ముప్పు పొంచి ఉన్నట్లు జింపెరియమ్ చెబుతోంది. ఈ యాప్ను గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో లేదు. థర్డ్ పార్టీ స్టోర్ ద్వారా దీనిని డౌన్లోడ్ చేసుకునే యూజర్లు రిస్క్లో పడతారు. ఈ యాప్ను చాలా సమయం వెచ్చించి పక్కా ప్లాన్ ప్రకారమే అభివృద్ధి చేసినట్లు జింపెరియమ్ సీఈవో శ్రీధర్ మిట్టల్ తెలిపారు. ఇలాంటి యాప్స్ ఇంకా ఉన్నాయని, వాటినీ గుర్తించే పనిలో ఉన్నట్లు చెప్పారు.
థర్డ్ పార్టీ స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ యూజర్లు ఈ సిస్టమ్ అప్డేట్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న వెంటనే స్మార్ట్ఫోన్లోని డేటా మొత్తాన్నీ హ్యాకర్లు సేకరిస్తారు. సాఫ్ట్వేర్ అప్డేట్ కోసం కూడా ఈ సిస్టమ్ అప్డేట్ యాప్ నోటిఫికేషన్లు పంపిస్తుందని గుర్తించారు. ఈ మాల్ వేర్ ద్వారా యూజర్ల డేటా మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. వీటి బారిన పడకుండా ఉండాలంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి కాకుండా మరో స్టోర్ ద్వారా యాప్స్ డౌన్లోడ్ చేయకపోవడం సరైనదని జింపెరియమ్ సంస్థ చెబుతోంది.
ఇవికూడా చదవండి..
100 కోట్లు ఇవ్వండి.. కేంద్రాన్ని కోరిన భారత్ బయోటెక్, సీరమ్
సుయెజ్ కాలువలో ఇరుక్కున్న ఎవర్గివెన్ షిప్ కాస్త కదిలింది
ప్రపంచంలో సెక్సీయెస్ట్ బాల్డ్ మ్యాన్.. ప్రిన్స్ విలియమ్
నాపై రిటైర్డ్ జడ్జి విచారణ జరుపుతారు: అనిల్ దేశ్ముఖ్
అనారోగ్యంతో బద్వేలు ఎమ్మెల్యే కన్నుమూత
కోహ్లి అడిగాడు.. సాఫ్ట్ సిగ్నల్కు నో చెప్పిన బీసీసీఐ
ఎన్నికల సిత్రాలు.. దాండియా ఆడిన కేంద్ర మంత్రి
నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి