కోట్లి: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందని ఆ ప్రాంత ప్రజలు ఆరోపించారు. భారీగా పాక్ ఆర్మీని మోహరించడంపై పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ నెల 25న జరిగిన ఎన్నికల్లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) 25 స్థానాల్లో, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) 11, పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పిఎంఎల్-ఎన్) 6 స్థానాల్లో గెలిచాయి. పీవోకే అసెంబ్లీలోని మొత్తం 53 మంది సభ్యులకు 45 మందిని ఎన్నికల ద్వారా నేరుగా ఎన్నుకుంటారు.
కాగా పీవోకే ప్రజల కంటితుడుపు కోసం ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ ఎన్నికలను ప్రహసంగా మార్చారని ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. అధికార పార్టీ రిగ్గింగ్కు పాల్పడిందని పీపీపీ చైర్పర్సన్ బిలావాల్ భుట్టో జర్దారీ ఆరోపించారు. ఎన్నికల ఫలితాలను తాము అంగీకరించడం లేదన్నారు.
మరోవైపు పీవోకేలోని గిల్గిట్-బాల్టిస్థాన్లో ఎన్నికలను పాకిస్థాన్ నిర్వహించడాన్ని భారత్ ఖండించింది. సైనిక ఆక్రమిత ప్రాంతం స్థితిని మార్చేందుకు చేసిన ఈ చర్యకు ఎటువంటి చట్టపరమైన ఆధారం, విలువ లేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.