హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): పసివయసులోనే నేరస్థులుగా ముద్రపడటం పిల్లలకు, సమాజానికి మంచిది కాదని, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. మైనర్లు సోషల్మీడియా మానియాలో పడితే ప్రమాదమని పేర్కొన్నారు. సోమవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు.. ఇవీ వివరాలు..
సోషల్మీడియా ప్రభావం మైనర్లపై ఎలా ఉన్నది?
ప్రస్తుతం ఆన్లైన్ క్లాసులతో ప్రతిఒక్కరి చేతిలో ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటున్నాయి. పిల్లలు ఏంచేస్తున్నారనే దృష్టి ఉపాధ్యాయులకు ఉండటంలేదు. కొందరు పిల్లలు స్క్రీన్ ఓపెన్చేసి, మరో పక్క సోషల్మీడియా చూస్తున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు తరగతులు వింటున్నారనే ఆలోచనతో ఉంటున్నా రు. ఇలా నెట్టింట్లోనే ఉండే కొందరు పిల్లలు ఫన్నీ పోస్టులు, నేరాలు, మహిళల ఫొటోలు, వీడియోలకు ఆకర్షితులవుతున్నారు.
మైనర్లు తప్పుచేస్తే ఎలా ట్రీట్ చేస్తారు?
మేజర్లు, మైనర్లు తప్పు చేస్తే వేరుగా ట్రీట్ చేయరు. చట్టం అందరికీ సమానమే. మైనర్లు నేరాలు చేస్తే మైనార్టీ తీరే వరకు జువెనైల్ హోమ్స్లో పెడుతారు, మేజర్గా మారిన తర్వాత సాధారణ జైలుకు తరలిస్తారు.
పిల్లలను సైబర్ క్రిమినల్స్, రాజకీయ పార్టీ లు కూడా పావుగా వాడుతున్నాయా!
సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కిన తర్వాత పిల్లలను బ్లాక్మెయిల్ చేస్తుంటారు. రాజకీయపార్టీలు కూడా మైనర్లతో సోషల్మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నట్టు తాజాగా సైబర్క్రైమ్ ఠాణాలో నమోదైన ఒక కేసులో పట్టుబడ్డ బాలుడి ఘటనతో వెలుగులోకి వచ్చింది. ఆ బాలుడు 24 గంటలు సెల్ఫోన్ పట్టుకొని సోషల్మీడియాలో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఇతరుల మాటలు విని, చట్ట వ్యతిరేక పనులకు పాల్పడ్డాడు. మైనర్లు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. పిల్లల నేర ప్రవృత్తిని అడ్డుకోవాలి. ఇం దుకు పోలీసుల సహాయాన్ని తీసుకోవచ్చు. సైబర్ నేరాలు చేసేవారిని గుర్తించేందుకు హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసుల వద్ద ప్రత్యేక సాఫ్ట్వేర్లు, టూల్స్ ఉన్నాయి. తప్పు చేసినవాళ్లు ఎక్కడున్నా పట్టుకునే సామర్థ్యం హైదరాబాద్ పోలీసులకు ఉన్నది. మైనర్లం కదా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు.. మైనర్లు కాదా వాళ్లతో నేరాలు చేపిస్తే మన పని అయిపోతుంది కదా.. అనే ధోరణితో ఉండేవారిని హెచ్చరిస్తున్నాం. తప్పు చేయించి తప్పుకుంటామనుకుంటే వాళ్లను కూడా వదలం.
తల్లిదండ్రులకు, మైనర్లకు మీ సూచనలు..
నేరం చేస్తే భవిష్యత్తు అంధకారమవుతుం ది. పాస్పోర్టు రాదు. ప్రభుత్వ ఉద్యోగాలు రావు. ఏ చిన్న తప్పుచేసినా రికార్డుల్లోకి ఎక్కుతారు. గతంలో అంతా మాన్యువల్గా ఉం డేది. తెలంగాణ వచ్చిన తర్వాత నేరం చేసిన ప్రతివ్యక్తి వివరాలతో డాటాబేస్ తయారవుతున్నది. ఇందులోకి పేరు ఎక్కిందంటే దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సదరు వ్యక్తి నేర చరిత్రను తెలుసుకోవచ్చు. కేసు నమోదైందంటే పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. తల్లిదండ్రులు ఈ విషయాలను గుర్తించండి.
ఇవీ కూడా చదవండి…
కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాం