International
- Dec 29, 2020 , 07:52:05
21లక్షల మందికి కొవిడ్ వ్యాక్సిన్ : సీడీసీ

వాషింగ్టన్ : అమెరికాలో కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసును 21,27,143 మందికి వేసినట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సోమవారం వెల్లడించింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ డేటా ప్రకారం.. కరోనా వైరస్కు 19.2శాతం మంది పాజిటివ్గా పరీక్షించగా.. 3.34లక్షల మందికిపైగా మరణించారు. అమెరికాలో వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతున్నందున, యూరోపియన్ యూనియన్లోని దేశాలకు కరోనా వైరస్ వ్యాక్సిన్ ‘స్వల్ప లాజిస్టికల్ సమస్య’ కారణంగా ఆలస్యమైందని ఫార్మాస్యూటికల్ దిగ్గజాలు ఫైజర్ అండ్ బయోఎన్ టెక్ సోమవారం ప్రకటించాయి. ‘మా డెలివరీలను పరిమిత సంఖ్యలో రీషెడ్యూల్ చేశాం. లాజిస్టికల్ సమస్య పరిష్కారమైంది. ఆ డెలివరీలు ఇప్పుడు బట్వాడా చేయబడుతున్నాయి’ అని, తయారీ సమస్యలు ఏవీ లేవని అని ఫార్మాస్యూటికల్ దిగ్గజం తెలిపింది.
తాజావార్తలు
- భారత్కు బ్రిటన్ ప్రధాని శుభాకాంక్షలు
- కనకరాజును సన్మానించిన జడ్పీచైర్పర్సన్, ఎమ్మెల్యేలు
- ఉద్రిక్తంగా కిసాన్ పరేడ్.. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం
- తేజస్వీ అందాల ఆరబోత.. వైరల్గా మారిన పిక్
- పబ్లిక్ గార్డెన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు
- రాజ్పథ్లో మెరిసిన కెప్టెన్ ప్రీతీ చౌదరీ..
- రిపబ్లిక్ డే పరేడ్లో ప్రత్యేక ఆకర్షణగా లఢఖ్ శకటం
- టీ-90 భీష్మ.. బ్రహ్మోస్ లాంచర్..పినాకా రాకెట్
- పద్మశ్రీ కనకరాజుకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు
- రవితేజ బర్త్డే .. ఖిలాడి ఫస్ట్ గ్లింప్స్ విడుదల
MOST READ
TRENDING