బీజింగ్: చైనాలో కరోనా కల్లోలం కొనసాగుతున్నది. ఆ దేశ ఆర్థిక నగరం షాంఘైలో కరోనా పరిస్థితి మరంత దారుణంగా, ప్రజల దుస్థితి దయనీయంగా ఉన్నది. చైనా అధికారులు, ఆసుపత్రి సిబ్బంది మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు. కరోనా బారిన పడిన ఒక వృద్ధుడు బతికే ఉన్నప్పటికీ చనిపోయినట్లుగా పేర్కొని బ్యాగ్లో ఉంచారు. అనంతరం ఈ విషయాన్ని గ్రహించి వృద్ధుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ ఆసుపత్రి సిబ్బంది తీరుపై చైనా వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి నలుగురు షాంఘై అధికారులను సస్పెండ్ చేశారు.
上海新长征福利院把还活着的老人装进尸袋,要送去殡仪馆火化,被运尸体的殡仪馆工作人员发现:“活的!”看来这是嫌上海老人死得还不够多,烧死活人不算死于新冠就行。 pic.twitter.com/O6Zn5qV76L
— 方舟子 (@fangshimin) May 1, 2022
కాగా, జీరో కరోనా పాలసీని అనుసరిస్తున్న చైనా చాలా కఠినంగా వ్యవహరిస్తున్నది. ఒక్క కరోనా కేసు నమోదైనా నగర వ్యాప్తంగా ప్రజలను క్వారంటైన్ చేయిస్తున్నది. దీంతో షాంఘై వాసులు గత నెల రోజులుగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారాలుగా కొనసాగుతున్న లాక్డౌన్ వల్ల ఇండ్లకే పరిమితమయ్యారు. ఆహారం లేక అనేక అవస్థలు పడుతున్నారు. ఒక వృద్ధుడు ఒక వాహనం వద్దకు వచ్చి తన గోడును వెళ్లబోసుకున్నాడు. ఆ వాహనంలోని వారు అరటిపళ్లు, బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వడంతో అతడు చాలా కృతజ్ఞతలు తెలిపాడు. చైనాలోని షాంఘై ప్రజల దయనీయ దుస్థితికి ఈ వీడియో అద్ధం పడుతున్నది.
Heart-wrenching video of a worker in Shanghai, who stops a truck to expose his desperation and hunger. Man breaks down crying when given bananas and crackers pic.twitter.com/trNTM9vHzi
— Chuang (@chuangcn) May 3, 2022