హైదరాబాద్ : యూనివర్సిటీ నియామకాలకు అడ్డంకులు తొలగిన నేపథ్యంలో త్వరలోనే పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య పద్దులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యాసంస్థల్లో కార్పొరేట్స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. సౌకర్యాల కల్పనకుగాను ఈ ఏడాది రూ.2 వేల కోట్లు కేటాయించడం జరిగిందన్నారు.
పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కమిటీలో తనతోపాటు మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు ఉన్నట్లు తెలిపారు. ప్రైవేటు పాఠశాలల టీచర్ల జీతాలపై ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. తిరుపతిరావు కమిటీ సిఫార్సుల మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.