సైనిక స్థావరంలో పేలిన బాంబు.. ఒకరి మృతి

ఇస్లామాబాద్: పాకిస్థాన్లో జరిగిన బాంబు దాడిలో ఓ వ్యక్తి మరణించగా, మరో ఏడుగురు గాయపడ్డారు. పాక్ సైనిక స్థావరమై రావల్పిండిలోని బస్ టెర్మినల్ సమీపంలో నిన్న రాత్రి టైం బాంబు పేలిందని పోలీసులు తెలిపారు. రాజధాని ఇస్లామాబాద్కు సమీపంలో ఉన్న రావల్పిండి.. దేశంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటి.
బస్ టెర్నినల్ సమీపంలో రిక్షాలో అమర్చిన టైం బాంబు పేలిందని, దీంతో ఒకరు మృతిచెందగా, ఏడుగురు గాయపడ్డారని వెల్లడించారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించామని చెప్పారు. ఈ పేలుళ్లకు బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఎవరూ ప్రకటించలేదన్నారు. ఈఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, ఉగ్రవాద కోణంలో కూడా విచారణ జరుపుతున్నామని తెలిపారు.
కాగా, పటిష్ట భద్రత నడుమ ఉంటే రావల్పిండిలో 2015 తర్వాత బాంబు దాడి జరగడం ఇదే మొదటిసారి. గత జూన్ నెలలో రావల్పిండిలోని ప్రముఖ మార్కెట్ సమీపంలో బాంబు దాడి జరిగింది. ఇందులో ఒకరు మరణించగా, 12 మందికిపైగా గాయపడ్డారు.
తాజావార్తలు
- 6 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం..
- చరిత్రలో ఈరోజు.. కైఫ్ కెప్టెనీలో అండర్-19 కప్ అందుకున్న భారత్
- తెలంగాణలో 1150 గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టులు
- ఐపీఎల్ వేలం.. క్వారంటైన్ అవసరం లేదు కానీ..
- భార్యపై అనుమానంతో కూతురు ఉసురుతీశాడు
- మితిమీరిన కామోద్రేకం.. శృంగారం చేస్తూ వ్యక్తి మృతి
- ఆ బిల్లులు రైతులకు అర్థం కాలేదు : రాహుల్ గాంధీ
- పోలీసులను పరామర్శించనున్న హోంమంత్రి అమిత్ షా
- క్రికెటర్ శిఖర్ ధావన్పై ఛార్జిషీట్
- టెన్త్ అర్హతతో రైల్వేలో 374 అప్రెంటిస్లు