ఖాట్మండు: సెంట్రల్ నేపాల్లో ఒక్కసారిగా వరదలు పోటెత్తాయి. ఈ వరదల్లో ఒకరు మృతిచెందగా పలువురు గల్లంతైనట్లు సమాచారం. మంచు కరగడంవల్ల మెలామ్చి, ఇంద్రావతి నదులు ఉప్పొంగి వరదలు పోటెత్తినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఈ వరదల కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోయారని, పలువురు గల్లంతయ్యారని తెలిపారు. ఈ వరదలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు.