Earth Shot Prize : బ్రిటన్కు చెందిన నాట్ప్లా స్టార్టప్కు ప్రిన్స్ విలియమ్స్ ఎర్త్ షాట్ క్లైమేట్ అవార్డు దక్కింది. బిల్డ్ ఏ వేస్ట్ ఫ్రీ వరల్డ్ విభాగంలో ఈ స్టార్టప్ ప్రైజ్ అందుకుంది. 10 లక్షల యూరోలు బహుమతిగా లభించాయి. వఆహార వ్యర్థాలు, ఒకసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ను నిర్మూలించేందుకు ఈ కృషి చేస్తోంది. ప్లాస్టిక్ బదులు సముద్రపు కలుపు మొక్కలతో తయారు చేసిన ప్రొడక్ట్స్ను తీసకొచ్చినందుకు వీళ్లకు ఈ ప్రైజ్ వచ్చింది. ఈ పోటీల్లో బహుమతి గెలిచిన లండన్కు చెందిన మొదటి వ్యక్తులుగా ఈ ఇద్దరు గుర్తింపు సాధించారు. బోస్టన్లో జరిగిన అవార్డు వేడుకలో నాట్ప్లాతో పాటు మరో ఐదు కంపెనీలు ఈ అవార్డు అందుకున్నాయి.
లండన్ కేంద్రంగా ఉన్నఈ సంస్థను 2014లో పైర్రే పస్లియర్, రొడ్రిగో గర్సియా గొంజలెజ్లు ప్రారంభించారు. లండన్లోని ఇంపీరియల్ కాలేజీ, రాయల్ కాలేజీ ఆఫ్ ఆర్ట్లో చదువుతున్న సమయంలోనే ఈ స్టార్టప్కు శ్రీకారం చుట్టారు. ఇన్నొవేటివ్ డిజైన్ ఇంజనీరింగ్ చదివిన ఈ ఇద్దరు పర్యావరణం కలుషింతం కావడానికి ప్లాస్టిక్ వాడకం ప్రధాన కారణం అని గ్రహించారు. ప్లాస్టిక్కు చెక్ పెట్టడం కోసం సీవీడ్తో చేసిన ప్రొడక్ట్స్ను అమ్మడం మొదలుపెట్టారు. మొదట్లో నీళ్లు ఉన్న బుడగన (Ooho)ను తయారుచేశారు. సముద్రపు కలుపు మొక్కల గుజ్జు, కాగితంతో తయారుచేస్తారు. 2020లో వేల్స్ రాజు, హిస్టోరియన్ సర్ డేవిడ్ అటెన్ బరో ఎర్త్షాట్ ప్రైజ్ను ప్రారంభించారు.