సియోల్: బైడెన్ సారథ్యంలోని అమెరికా సర్కారుకు ఉత్తరకొరియా ఘాటు హెచ్చరికలు చేసింది. వచ్చే నాలుగేండ్లు ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటే, సమస్యలు సృష్టించకుండా ఉంటే మంచిదని స్పష్టంచేసింది. ఉత్తరకొరియా అధినేత కిమ్జోంగ్ సోదరి, ఆ దేశ రెండో అత్యున్నత నేతగా వ్యవహరిస్తున్న కిమ్ యో జాంగ్ ఈ హెచ్చరికలు చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ జపాన్, దక్షిణకొరియాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.