ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలతోపాటు కొవిడ్ భయాలు కూడా సూచీలపై ప్రధానంగా ప్రభావం చూపుతున్నాయి. సోమవారం ఉదయం 10.00 గంటల సమయంలో సెన్సెక్స్ 350 పాయింట్లు నష్టపోయి 48,431 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 80 పాయింట్లు కోల్పోయి 14,550 వద్ద కొనసాగుతున్నది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ. 74.89 వద్ద ట్రేడవుతోంది.
దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ఉన్నాయి. సిప్లా, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ భారత్ పెట్రోలియం, బజాజ్ ఆటో స్వల్ప లాభాల్లో పయనిస్తుండగా.. ఎస్బీఐ, బజాజ్ ఫినాన్స్, టైటాన్ కంపెనీ, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాలను చవిచూస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
గర్భిణిపట్ల సిబ్బంది నిర్లక్ష్యం.. నర్సింగ్ హోమ్ బయటే ప్రసవం..!
కాంగ్రెస్ కంచుకోటల్లో మమత పాగా.. కారణం తెలుసా..?
పవన్ సరసన టాలెంటెడ్ నటి..!
Long COVID : కరోనా తగ్గినా దీర్ఘకాలికంగా మూడు లక్షణాలు..!