జెడ్డా : హజ్ యాత్ర వచ్చే నెల ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా 2021 ఏడాదికి సంబంధించి హజ్ విధానాన్ని ప్రకటించింది. ఈ సంవత్సరం విదేశీ యాత్రికులకు ప్రవేశాన్ని నిరోధించింది. హజ్ యాత్రలో ఈసారి కేవలం సౌదీ అరేబియాలో నివసించే ప్రజలే పాల్గొంటారని తెలిపింది. హజ్ యాత్రకు ఈ ఏడాది 60 వేల మందికి మాత్రమే అవకాశం కల్పించారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు గత ఏడాది కూడా హజ్ యాత్రకు విదేశీ యాత్రికులకు సౌదీ నిరాకరించింది.