ఐరాస, ఆగస్టు 19: లష్కరే తాయిబా, జైషే మహ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలు ఎలాంటి భయం లేకుండా మరింత ప్రోత్సాహంతో పనిచేస్తున్నాయని భారత్ పేర్కొన్నది. గురువారం ఐరాస భద్రతా మండలి సమావేశానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అధ్యక్షత వహించి మాట్లాడారు. ఉగ్రవాదులకు ఏ ఒక్క దేశమూ ఆశ్రయం ఇవ్వవద్దని కోరారు. పాకిస్థాన్లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు ముంబై, పఠాన్ కోట్, పుల్వామాలో చేసిన దాడులను గుర్తుచేశారు. అఫ్గాన్లో పరిణామాలు అంతర్జాతీయంగా భద్రత పట్ల ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. అఫ్గానిస్థాన్లో ఉగ్రవాద గ్రూపులు బలపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.