చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు నానాపాట్లు పడుతున్నారు. అలాగే తమ చేష్టలతో జనం, మీడియా దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. తమిళనాడు మంత్రి, అన్నాడీఎంకే అభ్యర్థి డీ జయకుమార్ బుధవారం తన రాయపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇస్త్రీ చేసే వ్యక్తి నుంచి ఇస్త్రీ పెట్టే తీసుకుని బట్టలకు ఇస్త్రీ చేసి స్థానికులను ఆకట్టుకున్నారు.