అత్యాధునిక క్రూయిజ్ క్షిపణి పరీక్ష సక్సెస్
సియోల్, సెప్టెంబర్ 13: అత్యాధునిక క్రూయిజ్ క్షిపణిని ఉత్తరకొరియా విజయవంతంగా పరీక్షించింది. ఇది 1,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఈ వ్యూహాత్మక క్షిపణికి రక్షణపరంగా అత్యంత ప్రాధాన్యత ఉన్నదని ఉత్తరకొరియా వార్తా సంస్థ కేసీఎన్ఏ పేర్కొంది. ఈ క్షిపణి పరీక్ష అమెరికా, దాని మిత్రదేశాలకు కచ్చితంగా ముప్పేనని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ క్షిపణికి అణువార్ హెడ్ అమరిస్తే ప్రమాదమన్నారు. ఇది రాడార్ల కన్నుగప్పి ప్రయాణించగలదని సమాచారం.