ముంబై : దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్నది. ప్రతిరోజూ లక్షల మంది మహమ్మారి బారిన పడుతున్నారు. వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించాలని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతున్నదని, ప్రధాని మోదీ దీన్ని సరిగా హ్యాండిల్ చేయలేరని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ పేర్కొన్నారు.
ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా ముగిశాయని, కాబట్టి కొవిడ్ ప్రభావం అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో పూర్తిస్థాయి లాక్డౌన్ విధించవచ్చని నవాబ్ మాలిక్ సూచించారు. దేశంలో భయానకమైన పరిస్థితులు ఉన్నాయని, అందుకే హెల్త్ ఎమర్జెన్సీ విధించాలని డిమాండ్ చేస్తున్నామని మాలిక్ చెప్పారు. అదేవిధంగా కరోనా కట్టడిపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
మామ సీఎం, ఇంటల్లుడు ఎమ్మెల్యే.. అసెంబ్లీలో అరుదైన సీన్..!
ఎమ్మెల్యేగా ఓడిన మమత సీఎం పదవి చేపడుతారా..?
కాంగ్రెస్ కంచుకోటల్లో మమత పాగా.. కారణం తెలుసా..?
Long COVID : కరోనా తగ్గినా దీర్ఘకాలికంగా మూడు లక్షణాలు..!