మంచిర్యాల జిల్లాలో 90.10 శాతం పన్నుల వసూలు
లక్ష్యం : రూ. 5.83 కోట్లు
ఇంకా వసూలు చేయాల్సింది : రూ. 57.19 లక్షలు
హాజీపూర్, ఏప్రిల్ 1 : 2020-2021 ఆర్థిక సంవత్సరం ముగిసింది. జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లు మాత్రం పూర్తి స్థాయిలో వసూలు కాలేదు. వంద శాతం వసూలు చేయాలని అధికారులు ప్రయత్నించినా వంద శాతానికి చేరుకోలేకపోయింది. గత ఏడాది కరోనా వైరస్తో మార్చి 23వ తేదీ నుంచి లాక్డౌన్ విధించడంతో పూర్తి స్థాయిలో పన్నులు వసూల్ కాలేదు. ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యం చేరుకుంటామనుకుంటే అంతంత మాత్రంగానే అయ్యింది. పూర్తి స్థాయిలో పన్నులను వసూలు చే యాలని పంచాయతీ కార్యదర్శులను అధికారులు ఎట్టి పరిస్థితుల్లో 100 శాతం పన్నులను వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను, నీటి పన్ను తదితర పన్నులు వసూలు చేస్తారు. ఇలా ఈ ఆర్థిక సంవత్సరం 311 జీపీల పరిధిలో రూ. 5 కోట్ల 83 లక్షల 19 వేల 387 వసూలు చేయాల్సి ఉండగా, ఇప్ప టి వరకు రూ. 5 కోట్ల 25 లక్షల 99 వేల 631 వసూలు చేశారు. ఇంకా రూ. 57 లక్షల 19 వేల 756 వసూలు చేయాల్సి ఉంది.మంచిర్యాల జిల్లాలో 311 గ్రామ పంచాయతీలుండగా ఇంటి విలువను బట్టి పన్ను నిర్ణయిస్తారు. దుకాణాల సముదాయం (కమర్షియల్), నివాస గృహాలకు (రెసిడెన్షియల్)కు వేర్వేరుగా పన్ను నిర్దారిస్తారు. ఈ పన్నును ప్రతి ఆర్థిక సంవత్సరం మార్చి 31వ తేదీ వరకు ఆర్థిక సంవత్సరంగా నిర్ణయించి వసూలు చేస్తారు. గ్రామాల్లో మంచినీటి వసతి, అంతర్గత రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీ తదితర నిర్వాహణ బాధ్యతలను గ్రామ పంచాయతీల ఆద్వర్వంలోనే నిర్వహిస్తారు. ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటికి పన్నుల వసూలు చేయడంలో అధికారులు, పంచాయతీ కార్యదర్శులు విఫలమయ్యారు. ఇప్పటి వరకు కేవలం 90.19 శాతం మాత్రమే వసూలు చేశారు.