సౌత్కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ సరికొత్త స్మార్ట్టీవీని భారత్లో లాంచ్ చేసింది. శాంసంగ్ ది ఫ్రేమ్ టీవీ 2021 పేరుతో స్మార్ట్టీవీని విడుదల చేసింది. మునుపటి మోడల్ కంటే ఇది 46శాతం సన్నగా ఉంటుంది. విభిన్న కలర్ బెజెల్స్ను ఎంచుకునే అవకాశాన్ని వినియోగదారులకు శాంసంగ్ను అందించింది. టీవీని ఏర్పాటు చేసిన ప్లేస్లో పరిసరాలకు సరిపోయేలా వైట్, టేకు తదితర కలర్లతో టీవీ అంచుల డిజైన్లను మార్చుకోవచ్చు.
ఫ్రేమ్ టీవీ 2021 4K QLED డిస్ప్లేతో వస్తుంది. ఇది 100శాతం కలర్ వాల్యూమ్ను అందిస్తుంది. దీనికి సంస్థ అభివృద్ధి చేసిన క్వాంటమ్ డాట్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. 43 అంగుళాల నుంచి 65 అంగుళాల వరకు వేర్వేరు సైజుల్లో ఈ టీవీ లభించనుంది. కొత్త టీవీ మోడళ్లలో యూహెచ్డీ క్వాలిటీలో 1,200 ఫొటోలను స్టోర్ చేసుకోవడానికి వీలుగా స్టోరేజ్ సామర్థ్యాన్ని 500 ఎంబీ నుంచి 6జీబీ వరకు పెంచింది.
భారత్లో ఈ టీవీ ప్రారంభ ధర రూ.61,990గా నిర్ణయించారు. స్మార్ట్టీవీని అమెజాన్, ఫ్లిప్కార్ట్, శాంసంగ్ అధికారిక ఆన్లైన్ స్టోర్ల నుంచి జూన్ 12 నుంచి కొనుగోలు చేయొచ్చు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డు ఈఎంఐలపై రూ.3వేల వరకు క్యాష్బ్యాక్ ఆఫర్ వర్తించనుంది.