అమెరికాలో సరికొత్త రోజు : జో బైడెన్

వాషింగ్టన్ : అమెరికాలో ఇది సరికొత్త రోజు అని అమెరికా తదుపరి అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యూఎస్ ప్రెసిడెంట్గా డోనాల్డ్ ట్రంప్ నాలుగు సంవత్సరాల పదవీకాలం అనంతరం బుధవారం వైట్హౌస్ను వీడారు. ట్రంప్ వైట్హౌస్ను వీడిన నిమిషాల్లోనే బైడెన్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. న్యూ డే ఇన్ అమెరికా అని పేర్కొన్నారు. ఈ రోజు ప్రారంభంలో వాషింగ్టన్ డీసీలోని సెయింట్ మాథ్యూస్ కేథడ్రల్ వద్ద ఐక్యతకు చిహ్నంగా డెమోక్రాటిక్, రిపబ్లికన్ నాయకులతో జరిగిన ఓ సామూహిక కార్యక్రమానికి బైడెన్ హాజరయ్యారు. సతీమణి జిల్ బిడెన్, డెమోక్రాటిక్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి, సేనేట్ మైనారిటీ నాయకుడు చక్ షుమెర్, అదేవిధంగా రిపబ్లికన్ సెనేట్ నాయకుడు మిచ్ మక్కన్నేల్, సభా నాయకుడు కెవిన్ మెక్కార్తీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా డోనాల్డ్ ట్రంప్ నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి కొన్ని గంటల ముందే వైట్హౌస్ను వీడి ఫ్లోరిడా బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది తన దీర్ఘకాలిక వీడ్కోలు కాదని, తాత్కాలికమేనన్నారు. ఏదో రూపంలో తిరిగి వస్తామని పేర్కొన్నారు.
తాజావార్తలు
- ఐసీసీ ర్యాంకింగ్స్లో దూసుకెళ్లిన రోహిత్, అశ్విన్
- మార్చి లేదా ఏప్రిల్లో పెట్రోల్ ధరలు తగ్గుతాయి: ధర్మేంద్ర ప్రధాన్
- బ్రెజిల్ ప్రధానికి ప్రధాని మోదీ అభినందనలు
- మల్లయోధుల బృందాన్ని సత్కరించిన పవన్ కళ్యాణ్
- ముంచుకొస్తున్న అంటార్కిటికా ముప్పు.. మంచు కొండలో పగుళ్లు.. వీడియో
- కాస్త స్పిన్ అయితే చాలు ఏడుపు మొదలుపెడతారు!
- సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ చిత్రం..!
- పుదుచ్చేరిలో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది : అమిత్ షా
- జీ-23 నేతల మీటింగ్ రాజ్యసభ సీటు కోసమే : ఎంపీ రంజీత్ రంజన్
- రేపటి నుంచి రెండో విడత వ్యాక్సినేషన్ : శ్రీనివాసరావు