కాఠ్మాండు: నేపాల్ ఆపద్ధర్మ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు తమ పార్టీ కట్టుబడి ఉందని ఆయన అన్నారు. నేపాల్ సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత షేర్ బహుదూర్ దేవుబాను మంగళవారంలోపు ప్రధానిగా నియమించాలని దేశాధ్యక్షురాలు బిద్యా దేవి భండారీకి కోర్టు సూచించింది. గతంలో రద్దు చేసిన పార్లమెంటును పునరుద్ధరించాలని ఆదేశించింది.
ప్రధాని కేపీ శర్మ ఓలీ సిఫారసుతో పార్లమెం టును రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని చీఫ్ జస్టిస్ చోలేంద్ర షంషేర్ రాణా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. మైనారిటీ ప్రభుత్వాన్ని నడుపుతూ మధ్యంతర ఎన్నికలకు సిద్ధమవుతున్న కమ్యూనిస్టు నేత ఓలీకి ఈ తీర్పుతో ఎదురుదెబ్బ తగిలింది. ఈ నెల 18న సాయంత్రం 5 గంటలకు పార్లమెంటును స మావేశపరచాలని కూడా సుప్రీంకో ర్టు ఆదేశించింది. 74 ఏండ్ల దేవుబా 1995-2018 మధ్యకాలంలో నాలుగుసార్లు ప్రధానిగా పనిచేశారు.