మహబూబాబాద్ : జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుడూరు మండలం భూపతిపేట గ్రామానికి చెందిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. భూపతిపేట గ్రామానికి చెందిన కుందారపు విక్కీ అనే వ్యక్తిని సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పదునైన కత్తులతో నుదిటిపై, తల వెనుక భాగంలో దాడి చేశారు. తీవ్ర గాయాలతు కావడంతో రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే హత్యకు గల కారణాలు తెలియరాలేదు.