రెండు దశల్లో నేపాల్ జాతీయ ఎన్నికలు

కాఠ్మండు: నేపాల్ జాతీయ ఎన్నికలు రెండు దశల్లో జరుగనున్నాయి. 2021 ఏప్రిల్ 30న తొలి దశ, మే 10న రెండో దశ పోలింగ్ జరుగుతుంది. ఈ మేరకు జాతీయ ఎన్నికలు నిర్వహించేందుకు ఆ దేశ ముఖ్య ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. పార్లమెంట్ను రద్దు చేయాలని ప్రధాని కేపీ శర్మ ఓలి చేసిన సిఫారసుకు నేపాల్ రాష్ట్రపతి బిద్యాదేవి భండారీ ఆదివారం ఆమోదం తెలిపారు. అనంతరం ప్రధాని ఓలి ఆ దేశ ముఖ్య ఎన్నికల కమిషనర్, ఇతర అధికారులను కలిశారు. జాతీయ ఎన్నికల నిర్వహణపై వారితో చర్చించారు. అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీలో ఏర్పడిన ముసలంతో ఉక్కిరి బిక్కిరి అయిన ప్రధాని కేపీ శర్మ ఓలి ఆదివారం ఏకంగా పార్లమెంట్నే రద్దు చేశారు. ఉదయం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. అనంతరం రాష్ట్రపతి బిద్యాదేవి భండారీని కలిసి పార్లమెంట్ రద్దుకు సిఫారసు చేయగా దానికి ఆమె ఆమోదం తెలిపారు.
కీలకమైన నియామకాలు చేయడానికి పూర్తి అధికారం తనకు తానుగా కట్టబెట్టుకుంటూ గత మంగళవారం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ వివాదాస్పదమైంది. బుధవారం సమావేశమైన పార్టీ స్టాండింగ్ కమిటీ ఈ ఆర్డినెన్స్ను ఉపసంహరించుకోవాలని ప్రధాని ఓలిని డిమాండ్ చేసింది. మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ నేతృత్వంలోని వ్యతిరేక వర్గాన్ని బుజ్జగించేందుకు ఓలి చాలా ప్రయత్నాలు చేశారు. శనివారం ప్రచండ ఇంటికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. ఫలితం లేకపోవడంతో చివరకు పార్లమెంట్ను రద్దు చేశారు. దీంతో నేపాల్లో రాజకీయ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో జాతీయ ఎన్నికలు అనివార్యమయ్యాయి.
తాజావార్తలు
- వేరుశనగ క్వింటాల్ @ రూ.7,712
- లైంగిక దాడి కేసులో వ్యక్తి 27 ఏళ్లు జీవిత ఖైదు
- ఈ 31లోపు అర్హులైన అందరికీ పదోన్నతులు : వి. శ్రీనివాస్ గౌడ్
- మీరారాజ్పుత్ హొయలు చూడతరమా..!
- ఉద్యమకారుడి కుటుంబానికి అండగా నిలిచిన ప్రభుత్వం
- ముందే కరోనా కట్టడిలో చైనా ఫెయిల్!
- కుల్సుంపురాలో బాలిక అదృశ్యం
- మధ్యప్రదేశ్లో ‘తాండవ్’పై బ్యాన్ విధిస్తాం
- బంగారు కమ్మలు కొనివ్వలేదని విద్యార్థిని ఆత్మహత్య
- ఎములాడలో దంతెవాడ ఎమ్మెల్యే పూజలు