వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్
వంగపహాడ్లో టీఆర్ఎస్లో పలువురి చేరిక
భీమారం, ఏప్రిల్ 15 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ పరిధి 2వ డివిజన్ వంగపహాడ్లో బీజేపీకి చెందిన జూలూరి వెంకన్నగౌడ్, గుజ్జుల లక్ష్మారెడ్డి, సముద్రాల శ్యాం, సముద్రాల మల్లేశం, వరికోలు వీరస్వామి, చింతం రమేశ్, కాంగ్రెస్కు చెందిన దోమ గణేశ్ తన సహచరులతో గురువారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే అరూరి రమేశ్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి, టీఆర్ఎస్లోకి వివిధ పార్టీల కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా చేరుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందన్నారు. కాగా, వంగపహాడ్లోని రెడ్డి సంఘం, ముదిరాజ్ సంఘం, ఎస్సీ సంఘాలు టీఆర్ఎస్ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఎమ్మెల్యే రమేశ్కు ఏకగ్రీవ తీర్మానాలు అందజేశాయి. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బానోత్ కల్పనా సింగులాల్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు గండు అశోక్యాదవ్, వంగపహాడ్ పీఏసీఎస్ చైర్మన్ మేరుగు రాజేశ్గౌడ్, ఎనుమాముల మార్కెట్ కమిటీ డైరెక్టర్ విజయ్కుమార్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి నునావత్ జవహర్ నాయక్, టీఆర్ఎస్ నాయకులు జూలూరి రాజు, దోమకుమార్, బొమ్మగాని వెంకటేశ్, మంద భాస్కర్, రఘుపతిరెడ్డి, గండు రాజయ్య, పీ రాజు, మాచర్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
సీఎం పదవికి జానారెడ్డిని కాంగ్రెస్ ఎన్నడూ పరిగణించలేదు: గుత్తా
ఆఫర్ల వెల్లువ..తొందరపడని నవీన్పొలిశెట్టి..!