వాషింగ్టన్: ఇండో అమెరికన్ విద్యార్థిని నటాషా పెరియనాయగమ్కు వరుసగా రెండోసారి వరల్డ్స్ బ్రైటెస్ట్ స్టూడెంట్ అవార్డు దక్కింది. అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ ట్యాలెంటెడ్ యూత్ ఈ పురస్కారాన్ని ఇచ్చింది. 76 దేశాలకు చెందిన 15 వేల మంది విద్యార్థులకు నిర్వహించిన గ్రేడ్ లెవల్ పరీక్షల ద్వారా జాన్స్ హాప్కిన్స్ సెంటర్ నటాషా పేరును ప్రకటించింది. 13ఏళ్ల పెరియనాయగమ్ న్యూ జెర్సీలోని ఫ్లోరెన్స్ ఎం గాడినీర్ మిడిల్ స్కూల్లో చదువుతోంది.
అయిదో గ్రేడ్ విద్యార్ధినిగా కూడా 2021లో ఆమె జాన్స్ హాప్కిన్స్ సెంటర్లో పరీక్ష రాసింది. అయితే పెరియనాయగమ్ తెలివితేటలు అమోఘంగా ఉన్నట్లు తేల్చారు. వర్బల్, క్వాంటిటేటివ్ సెక్షన్లలో.. గ్రేడ్ 8వ స్థాయి విద్యార్థులకు సమానంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ ఏడాది కూడా నటాషా అసాధారణ ప్రతిభ కనబరిచింది. ఎస్ఏటీ, ఏసీటీ, స్కూల్ అండ్ కాలేజ్ ఎబిలిటీ టెస్టులో ఆమె టాప్ ప్లేస్ కొట్టేసింది.
బొమ్మలు వేయడం.. పుస్తకాలు చదవడం పెరియనాయగమ్కు ఇష్టమని ఆ అమ్మాయి తల్లితండ్రులు చెప్పారు. పేరెంట్స్ స్వస్థలం చెన్నై. విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఎబో గ్రేడ్ లెవల్ పరీక్షలను సీటీవై టెక్నిక్ ద్వారా నిర్వహించారు. అయితే ట్యాలెంట్ సెర్చ్లో పెరియనాయగమ్ ఉత్తమ ర్యాంక్(హయ్యెస్ట్ గ్రేడ్) సాధించినట్లు జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ తన ప్రకటనలో తెలిపింది.