న్యూఢిల్లీ, మే 8: కొవిడ్ దవాఖానల్లో రోగులను చేర్చుకొనేందుకు కరోనా పాజిటివ్ సర్టిఫికెట్ ఇకపై తప్పనిసరి కాదని కేంద్రప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు అన్నింటికీ ఇది వర్తిస్తుందని పేర్కొన్నది. ఈ మేరకు ‘కొవిడ్ రోగులను దవాఖానలో చేర్చుకొనే విధానం, నిబంధనలు’లో మార్పులు చేసింది. ఈ నిబంధనను పాటించాలని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. కరోనా సోకినట్టు అనుమానం ఉన్నవారిని కూడా దవాఖానలో చేర్చుకోవాలని సూచించింది.