న్యూఢిల్లీ: హిమాలయ అందాలు అలరిస్తున్నాయి. మంచు శిఖరాలు ముగ్ద మనోహరంగా కనిపిస్తున్నాయి. నాసా వ్యోమగామి మార్క్ వేడ్ తీసిన చిత్రం ప్రకృతి ప్రేమికుల్ని థ్రిల్ చేస్తున్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో విహరిస్తున్న ఆస్ట్రోనాట్ మార్క్ తన కెమెరాల్లో హిమాలయ సౌందర్యాలను బంధించారు. మంచుతో కప్పుకుపోయిన ఆ అద్భుత పర్వతక్షేత్రాలు ఆ ఫోటోలో మిలమిల మెరిసిపోయాయి. ఆకాశం క్లియర్గా ఉన్న సమయంలో తీసిన ఆ ఫోటోను ఆయన తన ట్విట్టర్లో షేర్ చేశారు. వెచ్చని వాతావరణంలో హిమాలయాలు ఆకట్టుకుంటున్నాయని.. ఇలాంటి రమ్యమైన దృశ్యాలు చాలా అరుదుగా దర్శనమిస్తుంటాయని తన ట్వీట్లో ఆస్ట్రోనాట్ మార్క్ తెలిపారు.
ఆస్ట్రోనాట్ మార్క్తో పాటు స్పేష్ స్టేషన్లో ఉన్న మరో వ్యోమగామి షేక్ కిమ్బరో .. ఇటలీకి చెందిన టురిన్ నగర ఫోటోను షేర్ చేశాడు. ప్రాచీన చరిత్రకు ప్రఖ్యాతిగాంచిన టూరిన్ సిటీ .. రాత్రి పూట తీసిన ఫోటోల్లో దగదగలాడింది.