ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్ మరో కీలక మ్యాచ్కు సిద్ధమైంది. ఈ ఏడాది సీజన్ మధ్యలోనే కెప్టెన్ను మార్చుకున్న హైదరాబాద్.. అరుణ్జైట్లీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. రాజస్థాన్పై టాస్ గెలిచిన హైదరాబాద్ కొత్త కెప్టెన్ కేన్ విలియమ్సన్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
డేవిడ్ వార్నర్, సుచిత్, సిద్ధార్థ్ కౌల్ స్థానంలో మహ్మద్ నబీ, భువనేశ్వర్ కుమార్, అబ్దుల్ సమద్లను తుదిజట్టులోకి తీసుకున్నట్లు కేన్ చెప్పాడు. మరోవైపు ఉనద్కత్, శివమ్ దూబే స్థానంలో కార్తీక్ త్యాగీ, అనుజ్ రావత్లను ఎంపికచేసినట్లు రాజస్థాన్ సారథి సంజూ శాంసన్ తెలిపాడు.
ఆడిన ఆరు మ్యాచ్ల్లో ఒకే మ్యాచ్లో విజయం సాధించిన రైజర్స్ ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఆ జట్టు తర్వాత ఆడబోయే 8 మ్యాచ్ల్లో ఏడింటిలో గెలవాల్సి ఉంది. మరోవైపు, రాజస్థాన్ రాయల్స్ ప్రదర్శన కూడా పెద్ద చెప్పుకునే స్థాయిలో ఏమీ లేదు. ఆడిన ఆరు మ్యాచ్ల్లో కేవలం రెండింటిలో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో విజయం సాధించి గెలుపు బాట పట్టాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి.